'నిర్భయ' డాక్యుమెంటరీ
చట్టాలను కాగితాలకే పరిమితం చేస్తే ప్రయోజనం ఏముంది? వాటినే డాక్యుమెంటరీలుగా చూపిస్తే పదిమందికీ వెంటనే అర్థమవుతుంది. అవగాహన పెరుగుతుంది. ఇలా ఆలోచించిన వరంగల్ జిల్లా డీఎస్పీ రమాదేవి 'నిర్భయ' చట్టం మీద డాక్యుమెంటరీని రూపొందించారు.
ఢిల్లీలో జరిగిన 'నిర్భయ' సంఘటనను ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. ఏడాదిపాటు ఊరువాడ ఎక్కడ చూసినా ఇదే చర్చ. మహిళల భద్రత కోసం నిర్భయ పేరుతోనే చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం. 'దాని ఫలితం గ్రామీణ స్థాయిలోని మహిళలందరికీ అవగాహన కలిగినప్పుడే' అంటున్నారు డీఎస్పీ రమాదేవి. ఈమె జిల్లా పోలీసు అధికారుల ప్రోత్సాహంతో 'నిర్భయ'చట్టం మీద అందరికీ సులభంగా అర్థమయ్యేలా డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ ప్రయత్నం వెనక ఒక విషాదముంది. వరంగల్ - ఖమ్మం పరిధిలోని ఒక నిరుపేద గిరిజన బాలికను వచించాడు ఒక ప్రబుద్ధుడు. ఫలితంగా ఆమె గర్భవతైంది. అతను అమ్మాయి శీలానికి వెల కట్టడమే కాదు, ఊరు వదిలి వెళ్లిపొమ్మన్నాడు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అప్పటి వరంగల్ ఎస్పీ రాజేష్కుమార్ సంఘటనను సవాలుగా స్వీకరించి.. కేసు నమోదు చేశారు. విచారణకు ఆదేశించారు. బాధితురాలికి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అమ్మాయికి అండగా నిలబడింది డీఎస్పీ రమాదేవి. ఆమెకు వైద్యం చేయించి మనోస్థయిర్యాన్ని నింపింది. "ఆడపిల్లలంటే తల్లిదండ్రులకే కాదు. సమాజానికీ చిన్నచూపుంది. అది తొలగిపోవాలి. అందరిలోను చైతన్యం రావాలి. ముందుగా అమ్మాయిలందరూ తమకు రక్షణగా నిలిచే చట్టాల గురించి తెలుసుకుంటే మంచిది'' అంటున్న రమాదేవి స్వయంగా నిర్భయ డాక్యుమెంటరీకి స్క్రిప్ట్తో పాటు వాయిస్ఓవర్ కూడా ఇచ్చారు. స్థానిక కళాకారులైన ప్రియ, గీత, శ్వేత, షాలిని మొదలైనవారు నటించారు. బైరీ పూర్ణచందర్ దర్శకత్వంతోపాటు సంగీతాన్ని సమకూర్చారు. నర్సింహులపేట మండలం పెద్దముప్పారం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దీనికి స్పాన్సర్గా వ్యవహరించారు.
మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చైతన్యాన్ని కలగజేయడం, కళాబృందాలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి నేరాలపై అవగాహన కల్పించడం వంటివి చేస్తున్న రమాదేవి రూపొందించిన డాక్యుమెంటరీని జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో, పల్లెటూళ్లలో ప్రదర్శిస్తున్నారు. డీఎస్పీ కాకముందు తొమ్మిదిసార్లు ఉత్తమ ఎంపీడీవోగా పురస్కారం అందుకున్న రమాదేవి పోలీసు రంగంలోనూ ప్రజల మన్ననలను పొందుతుండటం విశేషం.
- ఎనుబోతుల భాస్కర్, ఖమ్మం
"ప్రభుత్వం 'నిర్భయ' చట్టం తీసుకొచ్చినా పరిస్థితి తీవ్రతలో ఏమాత్రం మార్పు రావడం లేదు. బా«ధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోలేకపోవడం.. ఒకవేళ చెబితే తనవాళ్ల పరువు మంటగలుస్తుందన్న భయం.. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం.. వంటి కారణాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ తొలగించేందుకే డాక్యుమెంటరీని తీశాం. దీన్ని చూసిన ఎంతోమంది ఆడపిల్లలు నాకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు''
Courtesy-Andhrajyothy
చట్టాలను కాగితాలకే పరిమితం చేస్తే ప్రయోజనం ఏముంది? వాటినే డాక్యుమెంటరీలుగా చూపిస్తే పదిమందికీ వెంటనే అర్థమవుతుంది. అవగాహన పెరుగుతుంది. ఇలా ఆలోచించిన వరంగల్ జిల్లా డీఎస్పీ రమాదేవి 'నిర్భయ' చట్టం మీద డాక్యుమెంటరీని రూపొందించారు.
ఢిల్లీలో జరిగిన 'నిర్భయ' సంఘటనను ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. ఏడాదిపాటు ఊరువాడ ఎక్కడ చూసినా ఇదే చర్చ. మహిళల భద్రత కోసం నిర్భయ పేరుతోనే చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం. 'దాని ఫలితం గ్రామీణ స్థాయిలోని మహిళలందరికీ అవగాహన కలిగినప్పుడే' అంటున్నారు డీఎస్పీ రమాదేవి. ఈమె జిల్లా పోలీసు అధికారుల ప్రోత్సాహంతో 'నిర్భయ'చట్టం మీద అందరికీ సులభంగా అర్థమయ్యేలా డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ ప్రయత్నం వెనక ఒక విషాదముంది. వరంగల్ - ఖమ్మం పరిధిలోని ఒక నిరుపేద గిరిజన బాలికను వచించాడు ఒక ప్రబుద్ధుడు. ఫలితంగా ఆమె గర్భవతైంది. అతను అమ్మాయి శీలానికి వెల కట్టడమే కాదు, ఊరు వదిలి వెళ్లిపొమ్మన్నాడు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అప్పటి వరంగల్ ఎస్పీ రాజేష్కుమార్ సంఘటనను సవాలుగా స్వీకరించి.. కేసు నమోదు చేశారు. విచారణకు ఆదేశించారు. బాధితురాలికి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అమ్మాయికి అండగా నిలబడింది డీఎస్పీ రమాదేవి. ఆమెకు వైద్యం చేయించి మనోస్థయిర్యాన్ని నింపింది. "ఆడపిల్లలంటే తల్లిదండ్రులకే కాదు. సమాజానికీ చిన్నచూపుంది. అది తొలగిపోవాలి. అందరిలోను చైతన్యం రావాలి. ముందుగా అమ్మాయిలందరూ తమకు రక్షణగా నిలిచే చట్టాల గురించి తెలుసుకుంటే మంచిది'' అంటున్న రమాదేవి స్వయంగా నిర్భయ డాక్యుమెంటరీకి స్క్రిప్ట్తో పాటు వాయిస్ఓవర్ కూడా ఇచ్చారు. స్థానిక కళాకారులైన ప్రియ, గీత, శ్వేత, షాలిని మొదలైనవారు నటించారు. బైరీ పూర్ణచందర్ దర్శకత్వంతోపాటు సంగీతాన్ని సమకూర్చారు. నర్సింహులపేట మండలం పెద్దముప్పారం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దీనికి స్పాన్సర్గా వ్యవహరించారు.
మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చైతన్యాన్ని కలగజేయడం, కళాబృందాలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి నేరాలపై అవగాహన కల్పించడం వంటివి చేస్తున్న రమాదేవి రూపొందించిన డాక్యుమెంటరీని జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో, పల్లెటూళ్లలో ప్రదర్శిస్తున్నారు. డీఎస్పీ కాకముందు తొమ్మిదిసార్లు ఉత్తమ ఎంపీడీవోగా పురస్కారం అందుకున్న రమాదేవి పోలీసు రంగంలోనూ ప్రజల మన్ననలను పొందుతుండటం విశేషం.
- ఎనుబోతుల భాస్కర్, ఖమ్మం
"ప్రభుత్వం 'నిర్భయ' చట్టం తీసుకొచ్చినా పరిస్థితి తీవ్రతలో ఏమాత్రం మార్పు రావడం లేదు. బా«ధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోలేకపోవడం.. ఒకవేళ చెబితే తనవాళ్ల పరువు మంటగలుస్తుందన్న భయం.. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం.. వంటి కారణాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ తొలగించేందుకే డాక్యుమెంటరీని తీశాం. దీన్ని చూసిన ఎంతోమంది ఆడపిల్లలు నాకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు''
Courtesy-Andhrajyothy
No comments:
Post a Comment