Tuesday, 29 October 2013

మనమ్మాయికి 1.8 లక్షల రూపాయలు స్కాలర్‌షిప్!

ఒక విద్యార్ధికి ప్రతి ఏడాది 1.8 లక్షల రూపాయలు స్కాలర్‌షిప్ వస్తే? దేశంలోనే అత్యున్నతమైన న్యాయనిపుణులు ఆమెను ఆ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేస్తే? ఎంత ఆనందం! ఎంత గౌరవం! మన హైదరాబాద్‌కు చెందిన హర్షితా రెడ్డి కాసర్ల అలాంటి గౌరవం దక్కించుకుంది. ఆదిత్య బిర్లా గ్రూపు గత వారం ప్రకటించిన స్కాలర్‌షిప్‌లకు ఆమె ఎంపికయింది. స్కాలర్‌షిప్ ద్వారా వచ్చే సొమ్ముకన్నా దేశ«ంలో అత్యున్నత న్యాయనిపుణులను కలవటమే ఎక్కువ ఆనందం కలిగిస్తోందంటున్న హర్షితారెడ్డిని నవ్య పలకరించింది..

"నాకు చిన్నప్పటి నుంచి పబ్లిక్ డిబేట్‌లంటే ఇష్టం. చిన్నప్పుడు స్కూల్‌లో డిబేటింగ్ పోటీలలో నాదే ఫస్ట్. అందుకే ఇంటర్‌లో చాలామందిలా ఎంపీసీ, బీపీసీలలో చేరలేదు. హ్యూమానిటీస్‌లో చేరాను. ఆ తర్వాత నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య చదవటానికి చేరాను. ఆ సమయంలోనే నాకు ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్‌ల గురించి తెలిసింది. బిజినెస్, ఇంజనీరింగ్, న్యాయవిద్యలలో దేశవ్యాప్తంగా 80 మందిని గుర్తించి వారికి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు వాళ్లు. మన దేశంలో ఈ తరహా స్కాలర్‌షిప్ ఇదొకటే. ఈ సారి న్యాయవిద్యలో స్కాలర్‌షిప్‌ల కోసం నాలుగు విశ్వవిద్యాలయాలకు చెందినవారు పోటీ పడ్డారు. దీనిలో పాల్గొనేవారు రెండు వ్యాసాలు రాసి పంపాలి. మన బయోడేటా, రాసిన వ్యాసాల ఆధారంగా 20 మందిని ఎంపిక చేశారు.

దానిలో నేను కూడా ఉన్నాను. మా అందరిని ముంబాయిలో ఒక ప్యానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ప్యానల్‌కు భారత దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య నేతృత్వం వహించారు. మిగిలినవారందరూ కూడా ప్రముఖ న్యాయనిపుణులే. వారి ముందు హాజరవటం ఒక గొప్ప అనుభవం. ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనటానికి 80 మంది వచ్చారు. వారందరితోను కలిసి మూడు రోజులు ముంబాయిలో ఉన్నా. అదొక కొత్త లోకం అనిపించింది. స్కాలర్‌షిప్ వచ్చిందని తెలిసిన వెంటనే మా అమ్మ, నాన్న- నాకన్నా ఎక్కువ ఆనందపడ్డారు. మాది ఉమ్మడి కుటుంబం. మొత్తం ఎనిమిది మంది పిల్లలం ఉంటాం. ఇంట్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. నాకు స్కాలర్‌షిప్ ద్వారా వచ్చే డబ్బు కన్నా, దేశంలో ప్రముఖ నిపుణులు నన్ను ఎంపిక చేశారనే భావనే ఎక్కువ ఆనందం కలిగించింది. అంతే కాదు. ప్రతి ఏడాది నల్సార్ విశ్వవిద్యాలయానికి స్కాలర్‌షిప్‌లు వస్తాయి. ఈ సారి నా ద్వారా రావటం చాలా ఆనందం కలిగించింది. నాతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా ఈ స్కాలర్‌షిప్ వచ్చింది. ఇక మీద నా ఫీజు మా అమ్మనాన్న కట్టాల్సిన అవసరం లేదు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా వచ్చిన సొమ్ము సరిపోతుంది. నా చదువు ఇంకా నాలుగేళ్లు ఉంది. ఆ తర్వాత దేశంలోనే అత్యున్నత న్యాయనిపుణురాలిగా ఎదగాలనేది నా కోరిక..''
Courtesy-Andhrajyothy

మనమ్మాయికి స్కాలర్‌షిప్!

Published at: 04-10-2013 00:52 AM
ఒక విద్యార్ధికి ప్రతి ఏడాది 1.8 లక్షల రూపాయలు స్కాలర్‌షిప్ వస్తే? దేశంలోనే అత్యున్నతమైన న్యాయనిపుణులు ఆమెను ఆ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేస్తే? ఎంత ఆనందం! ఎంత గౌరవం! మన హైదరాబాద్‌కు చెందిన హర్షితా రెడ్డి కాసర్ల అలాంటి గౌరవం దక్కించుకుంది. ఆదిత్య బిర్లా గ్రూపు గత వారం ప్రకటించిన స్కాలర్‌షిప్‌లకు ఆమె ఎంపికయింది. స్కాలర్‌షిప్ ద్వారా వచ్చే సొమ్ముకన్నా దేశ«ంలో అత్యున్నత న్యాయనిపుణులను కలవటమే ఎక్కువ ఆనందం కలిగిస్తోందంటున్న హర్షితారెడ్డిని నవ్య పలకరించింది..
"నాకు చిన్నప్పటి నుంచి పబ్లిక్ డిబేట్‌లంటే ఇష్టం. చిన్నప్పుడు స్కూల్‌లో డిబేటింగ్ పోటీలలో నాదే ఫస్ట్. అందుకే ఇంటర్‌లో చాలామందిలా ఎంపీసీ, బీపీసీలలో చేరలేదు. హ్యూమానిటీస్‌లో చేరాను. ఆ తర్వాత నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య చదవటానికి చేరాను. ఆ సమయంలోనే నాకు ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్‌ల గురించి తెలిసింది. బిజినెస్, ఇంజనీరింగ్, న్యాయవిద్యలలో దేశవ్యాప్తంగా 80 మందిని గుర్తించి వారికి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు వాళ్లు. మన దేశంలో ఈ తరహా స్కాలర్‌షిప్ ఇదొకటే. ఈ సారి న్యాయవిద్యలో స్కాలర్‌షిప్‌ల కోసం నాలుగు విశ్వవిద్యాలయాలకు చెందినవారు పోటీ పడ్డారు. దీనిలో పాల్గొనేవారు రెండు వ్యాసాలు రాసి పంపాలి. మన బయోడేటా, రాసిన వ్యాసాల ఆధారంగా 20 మందిని ఎంపిక చేశారు.
దానిలో నేను కూడా ఉన్నాను. మా అందరిని ముంబాయిలో ఒక ప్యానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ప్యానల్‌కు భారత దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య నేతృత్వం వహించారు. మిగిలినవారందరూ కూడా ప్రముఖ న్యాయనిపుణులే. వారి ముందు హాజరవటం ఒక గొప్ప అనుభవం. ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనటానికి 80 మంది వచ్చారు. వారందరితోను కలిసి మూడు రోజులు ముంబాయిలో ఉన్నా. అదొక కొత్త లోకం అనిపించింది. స్కాలర్‌షిప్ వచ్చిందని తెలిసిన వెంటనే మా అమ్మ, నాన్న- నాకన్నా ఎక్కువ ఆనందపడ్డారు. మాది ఉమ్మడి కుటుంబం. మొత్తం ఎనిమిది మంది పిల్లలం ఉంటాం. ఇంట్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. నాకు స్కాలర్‌షిప్ ద్వారా వచ్చే డబ్బు కన్నా, దేశంలో ప్రముఖ నిపుణులు నన్ను ఎంపిక చేశారనే భావనే ఎక్కువ ఆనందం కలిగించింది. అంతే కాదు. ప్రతి ఏడాది నల్సార్ విశ్వవిద్యాలయానికి స్కాలర్‌షిప్‌లు వస్తాయి. ఈ సారి నా ద్వారా రావటం చాలా ఆనందం కలిగించింది. నాతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా ఈ స్కాలర్‌షిప్ వచ్చింది. ఇక మీద నా ఫీజు మా అమ్మనాన్న కట్టాల్సిన అవసరం లేదు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా వచ్చిన సొమ్ము సరిపోతుంది. నా చదువు ఇంకా నాలుగేళ్లు ఉంది. ఆ తర్వాత దేశంలోనే అత్యున్నత న్యాయనిపుణురాలిగా ఎదగాలనేది నా కోరిక..''
- See more at: http://www.andhrajyothy.com/node/6765#sthash.JHgTqLAf.dpuf

No comments:

Post a Comment