Wednesday, 30 October 2013

సామాజిక సేవలో యుసివెబ్‌ ఇండియా

యుసివెబ్‌ తన సామాజిక సేవా కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐదు మధ్యాహ్న పాఠశాలలను నిర్వహిస్తున్న ‘అమితాష’ అనే స్వచ్ఛంద సంస్థకు తన సహాయ సహకారాలను అందించింది. దాదాపు వెయ్యి మంది విద్యార్థినులకు విద్య, సంక్షేమానికి అయ్యే వ్యయాన్ని భరించేందుకు సమ్మతించింది. ఈ విద్యార్ధినులకు ఉచిత విద్య, భోజనం, ఆరోగ్య పరిరక్షణతోపాటు ఇతర ప్రయోజనాలను అందించనుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక దీపావళి గ్రీటింగ్‌కార్డులు, దియాలను కొనుగోలు చేసి అందిస్తోంది. యుసివెబ్‌ ఎప్పుడూ సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతుందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెన్నీ యే పేర్కొన్నారు. తమ సంస్థ ఉద్యోగులు, భాగస్వాముల మధ్య సమగ్రతకు కృషి చేస్తుందని ఆయన వివరించారు. 
Courtesy-Surya

No comments:

Post a Comment